సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన నిజామాబాద్ వాసి.. పుస్తెల తాడుతో సహా ఇంటిని అమ్మేసి..
కువైట్లో నిజామాబాద్ వాసిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. లాటరీ పేరిట సుమారు 15 లక్షలు కాజేశారు. లాటరీలో 46 లక్షలు వచ్చాయని సైబర్ నేరగాళ్ల నుంచి నిజామాబాద్ వాసి అశోక్ కి ఫోన్కాల్ వచ్చింది.
ఇది నిజమని నమ్మిన అశోక్ లాటరీ డబ్బులు వస్తే తమ బతుకులు బాగుపడుతాయని భావించి అశోక్, ముత్తమ్మ దంపతులు పుస్తెల తాడుతో సహా ఇంటిని అమ్మేసి రూ.15లక్షలు సైబర్ నేరస్తుల అకౌంట్లో జమచేశారు. కొద్ది రోజుల తర్వాత అది ఫేక్ లాటరీ అని తెలిసింది. దీంతో అశోక్ కుటుంబ సభ్యులు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం స్పందించి తమ డబ్బులు రికవరీ చేయించాలని బాధితులు వేడుకుంటున్నారు.