TSPSC: టీఎస్‌పీఎస్సీ కేసులో కీలక మలుపు.. ఇవాళ విచారణకు హాజరుకానున్న రామచంద్రన్‌, లింగారెడ్డి

TSPSC: సెక్రెటరీ అనితా రామచంద్రన్‌, సభ్యుడు లింగారెడ్డికి సిట్‌ నోటీసులు

Update: 2023-04-01 04:11 GMT

TSPSC: టీఎస్‌పీఎస్సీ కేసులో కీలక మలుపు.. ఇవాళ విచారణకు హాజరుకానున్న రామచంద్రన్‌, లింగారెడ్డి

TSPSC: TSPSC కేసులో ఊహించని ట్విస్ట్‌ తెరపైకి వచ్చింది. TSPSC సెక్రెటరీ అనితా రామచంద్రన్‌తో‌ పాటు సభ్యుడు లింగారెడ్డికి సిట్‌ నోటీసులు జారీ చేసింది. ఇవాళ విచారణకు రావాలని రామచంద్రన్‌, లింగారెడ్డికి నోటీసులచ్చింది సిట్. అనితా రామచంద్రన్‌ వద్ద పీఏగా ప్రవీణ్‌, లింగారెడ్డి దగ్గర పీఏగా రమేష్‌ పనిచేస్తున్నారు. మరోవైపు, ఇదే కేసులో.. TSPSC చైర్మన్‌ జనార్ధన్‌రెడ్డిని కూడా విచారించే అవకాశం కనిపిస్తోంది. అలాగే.. TSPSC లో పనిచేస్తున్న మరి కొంతమంది సభ్యులకు కూడా నోటీసులు ఇచ్చే ఆలోచనలో సిట్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక.. ఇప్పటివరకు ఈ కేసులో 15 మందిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు.. గ్రూప్‌-1 పరీక్షలో 100కు పైగా మార్కులు వచ్చినవారిలో 100 మందిని విచారించి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేశారు.

Tags:    

Similar News