Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన సీపీఎం నేతలు

Revanth Reddy: సీపీఎం మద్దతు కోరిన కాంగ్రెస్ నేతలు

Update: 2024-04-27 07:37 GMT

Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన సీపీఎం నేతలు

Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డిని సీపీఎం నేతలు కలిశారు. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సీపీఎం మద్దతు కోరింది. అయితే భువనగిరిలో సీపీఎం పార్లమెంట్ స్థానానికి తమ అభ్యర్థిని బరిలో నిలిపింది. ఇవాళ సీపీఎం నేతలను సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి ఆహ్వానించారు. ఎన్నికలు ముగిసిన వెంటనే సీపీఎంకు... రెండు కార్పొరేషన్‌లు, ఒక ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అభ్యర్థులను విరమించుకోవాలని సీఎం కోరినట్లు తమ్మినేని వీరభద్రం తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. బీజేపీ, ఇతర శక్తులను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

Tags:    

Similar News