తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం
తెలంగాణలో నిర్మల్ జిల్లాలోని భాగ్యనగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది.
తెలంగాణలో నిర్మల్ జిల్లాలోని భాగ్యనగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై రెయిలింగ్ను ఢీకొట్టింది. లారీ అదుపు తప్పి పక్కకు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు లారీలో 70 మంది వలస కూలీలు ఉన్నారు. వారిలో 9 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
20 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. హైదరాబాద్ నుంచి యూపీలోని ఘోరక్పూర్ వెళ్తున్నారు. గాయపడినవారిని దగ్గర్లోని నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హైదరాబాద్ తరలించారు.