TS News: రైతుల్ని నిండాముంచుతున్న పత్తి వ్యాపారులు

TS News: వారు తెచ్చిన కాంటాతో తూకం వేసిన వ్యాపారులు

Update: 2023-02-14 09:42 GMT

TS News: రైతుల్ని నిండాముంచుతున్న పత్తి వ్యాపారులు

TS News: పత్తి వ్యాపారులు రైతుల్ని నిండా ముంచుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కల్లెడ గ్రామానికి చెందిన కొందరు పత్తి వ్యాపారులుములుగు జిల్లా ములుగు మండలం అంకన్నగూడెం తదితర ఏజెన్సీ గ్రామాల నుంచి పత్తి కొనుగోలు చేసి తరలిస్తున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు పత్తిని ట్రక్కుల్లో తరలించారు. వారు తీసుకొచ్చిన కాంటాతో తూకం వేసి పత్తని కొనుగోలు చేశారు. వారు తెచ్చిన ఎలట్రిక్ కాంటాలో ఎనిమిది క్వింటాళ్లు పత్తిని వేస్తే నాలుగు కిలోలుగా తూకం చూపిస్తోంది. దీంతో రైతులు మరో కాంటా తీసుకొచ్చి తూకం వేయగా మోసం బయటపడింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గిరిజన రైతులు పత్తి వ్యాపారులపై దాడి చేశారు. 

Tags:    

Similar News