తెలంగాణాలో కరోనా పెరుగుతూనే ఉంది..
తెలంగాణలో కరోనా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూనే ఉంది. ఈరోజు కొత్తగా 143 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూనే ఉంది. ఈరోజు కొత్తగా 143 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,290కి చేరింది. ఇక ఇప్పటికే కరోనాతో 1,550 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం కుదుట పది ఇప్పటివరకూ 1627 మంది డిశ్చార్జి అయ్యారు. ఇక గత 24 గంటల్లో 8 మంది మృతి చెందారు. దీంతో మొత్తంగా మృతి చెందినా వారి సంఖ్య 113కు చేరింది.
ఇక ఈరోజు జిల్లాల వారీగా చూస్తె.. రంగారెడ్డిలో 8, మహబూబ్ నగనగర్లో 5, వరంగల్లో 3, ఖమ్మం, ఆదిలాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో రెండు చొప్పున నమోదయ్యాయి. మంచిర్యాలలో 1 పాజిటివ్ కేసు నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 116 కేసులు నమోదు అయ్యాయి.