Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 2,817 పాజిటివ్ కేసులు...

Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

Update: 2020-09-03 03:38 GMT

Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2,817 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,33,406కి చేరింది. మృతుల సంఖ్య 856కి పెరిగింది. నిన్న ఒక్క రోజే 2,611 కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1,00,013కి చేరింది. ప్రస్తుతం 32,537 మంది చికిత్స వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.84 ఉందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కోలుకున్న వారి రేటు 74.9కు చేరుకుంది. జీహెచ్ఎంసీలో - 452, రంగారెడ్డి- 216, కరీంనగర్ 164, ఖమ్మం 157, నల్గొండ 157 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు తెలంగాణాలో 14,83,267 కరోనా పరీక్షలు చేయడం జరిగింది.


Tags:    

Similar News