Coronavirus updates in Telangana: తెలంగాణ‌లో కొత్త‌గా 1,473 కరోనా పాజిటివ్ కేసులు

Update: 2020-07-27 07:02 GMT
Representational Image

Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,473 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 55,532కి చేరింది. మృతుల సంఖ్య 471కి పెరిగింది. కరోనా నుంచి తాజాగా 774 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 42,106కి చేరింది.

ప్రస్తుతం 12,955 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.85 శాతమని అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే 9,817మంది నమూనాలను పరీక్షించగా, 1,473 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. రాష్ర్టంలో ఇప్ప‌టి వ‌ర‌కు 3,63,242 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ప్రతి 10 లక్షల జనాభాలో 245 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Delete Edit




Tags:    

Similar News