తెలంగాణలో మరో ఇద్దరు మృతి.. 872కు పెరిగిన కరోనా కేసులు

దేశవ్యాప్తంగా 21రోజుల లాక్ డౌన్ విధించినప్పటికి కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు క్రమక్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి

Update: 2020-04-20 15:03 GMT
Representational Image

దేశవ్యాప్తంగా 21రోజుల లాక్ డౌన్ విధించినప్పటికి కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు క్రమక్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక తెలంగాణలో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో కొత్తగా మరో 26 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 18వ తేదీ అర్ధరాత్రి నుంచి 19వ తేదీ అర్ధరాత్రి వరకు ఈ కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. కరోనా సోకిన వారిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు.

ఇక ఇవ్వాళ తెలంగాణలో మొత్తం 14 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో హైదరాబాదులో 12 కేసులు నమోదు కాగా, మేడ్చెల్, నిజామబాద్ లో ఒక్క కేసు నమోదు అయ్యింది. తాజా కేసులతో కలిపి తెలంగాణలో 872 కేసులు నమోదు అయ్యాయి. ఇవ్వాళ ఇద్దరు మృతి చెందారు. దీనితో రాష్ట్రంలో 23కి మృతుల సంఖ్య చేరింది.




 

Tags:    

Similar News