చలో రాజ్‌భవన్‌కు సిద్ధమవుతున్న తెలంగాణ కాంగ్రెస్

* లుంబినీ పార్క్‌ నుంచి రాజ్‌భవన్‌కు పాదయాత్ర * రైతు ఉద్యమానికి సంఘీభావంగా పాదయాత్ర * పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలంటూ డిమాండ్

Update: 2021-01-19 03:32 GMT

తెలంగాణ రాజభవన్ (ఫైల్ ఫోటో)

తెలంగాణ కాంగ్రెస్ చలో రాజ్‌భవన్‌కు సిద్ధమవుతోంది. సెక్రటేరియట్‌ లుంబినీపార్క్‌ నుంచి రాజ్‌భవన్‌ వరకు పాదయాత్రగా వెళ్లనున్నారు. రైతు ఉద్యమానికి సంఘీభావంగా.. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్‌ నాయకులు రాజ్‌భవన్‌కు చేరుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ.. ఈ పాదయాత్రను చేపట్టనున్నారు.  

Tags:    

Similar News