ప్రజలు కాంగ్రెస్ను అందుకే తిడుతున్నారు.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Komatireddy Raj Gopal Reddy: రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Komatireddy Raj Gopal Reddy: రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒకసారి రైతుబంధు పడిందని.. మధ్యలో ఒకసారి వేయలేదని అన్నారు. రైతు భరోసాలో ఇచ్చిన హామీ మేరకు కాకుండా కొంత నగదు తగగ్గించామని అన్నారు.
అందుకే గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారని.. కేసీఆర్ను మెచ్చుకుంటున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని అప్పులు చేసి అయినా హామీలు నిలబెట్టుకుంటామని.. సంక్షేమ పథకాలు అమలుచేస్తామని అన్నారు రాజగోపాల్ రెడ్డి.
ముఖ్యంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రూపకల్పన తీరు సరిగా లేదంటూ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. ఈ వ్యాఖ్యలు చేశారు.