Uttam Kumar Reddy Praises KTR: మంత్రి కేటీఆర్‌ డైనమిక్ మినిస్టర్..

Update: 2020-06-29 13:15 GMT

Uttam Kumar Reddy Praises KTR: ఏ రాష్ట్రంలోనైనా అధికార పార్టీకి, ప్రతి పక్ష పార్టీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమంటుందన్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి నిత్యం ఇదే జరుగుతుంది. అధికార పార్టీ టీఆర్ఎస్, అలాగే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మధ్య వైరం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఏదో ఒక విషయంలో ఒక పార్టీ నాయకులపై, మరో పార్టీ నాయకులు మాటల తూటాలు పేల్చుకుంటూనే ఉంటారు. అలాంటి వారు ఒకే వేదికపై ఉంటే ఆ ప్రాంతంలో ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రి కేటీఆర్, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్. ఇరు పార్టీల నేతలు నిత్యం విమర్శలు చేసుకుంటారు. ఒకరిపై మరొకరు నిప్పులు నిప్పులు చెరుగుతారు. మరి ఆ ఇద్దరు నేతలు ఒకే వేదికపై ప్రత్యక్షమైతే..ఆ వేదికపై వాతావరణం వేడెక్కుతుందనుకుంటారు.

కానీ ఈ రోజు జరిగిన ఓ సభలో మాత్రం సీన్ కాస్త రివర్స్ అయ్యింది. మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటల తూటాలు కాకుండా, ప్రశంసల వర్షం కురిపించారు. ఏంటి ఇంతటి ఆశ్చర్యం అనుకుంటున్నారా. అయితే ఎక్కడ జరిగిందో, ఏం జరిగిందో తెలుసుకుందాం. తెలంగాణ మంత్రి కేటీఆర్ సోమవారం హుజూన్ నగర్ నియోజకవర్గంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా మొక్కలు నాటిన కేటీఆర్ అనంతరం హుజూర్‌నగర్‌లోని మండలాధికారి కార్యాలయంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. డైనమిక్ మినిస్టర్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. టీపీసీసీ పొగడ్తలతో సభకు హాజరైనంత వారంతా అరుపులు కేకలతో చప్పట్ల మోత మోగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సైదిరెడ్డి పాల్గొన్నారు.


Tags:    

Similar News