అమేధి లోక్సభ స్ధానానికి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ కు కంచుకోట అయిన అమేధిలో రాహుల్ ఇప్పటికి మూడుసార్లు గెలుపొందారు. ఆయన ఎన్నికల రంగప్రవేశం కూడా ఇక్కడినుంచే జరిగింది.కేరళలోని వయనాడ్లోనూ రాహుల్ పోటీచేస్తున్నారు. ఇప్పటికే అక్కడ నామినేషన్ కూడా దాఖలు చేశారు. అమేధిలో రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో తలపడనున్నారు. రాహుల్ నామినేషన్ సందర్భంగా పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టారు. రాహుల్ నామినేషన్ సందర్భంగా ఆయన వెంట యూపీఏ చీఫ్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.