తెలంగాణ అసెంబ్లీ ఇన్నర్ లాబీల్లో ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం

Update: 2019-09-19 10:59 GMT

తెలంగాణ అసెంబ్లీ ఇన్నర్ లాబీల్లో ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పార్టీ మారడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భట్టి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. వీరి ముగ్గురు మధ్య వాగ్వాదం పెరగడంతో లాబీలో ఉన్న ఇతర ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. ముగ్గరిని వారించి, అక్కడి నుంచి తీసుకెళ్లారు. పార్టీ మారడంపై రాజగోపాల్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి మధ్య మొదట వాగ్వాదం మొదలైంది. వీరిద్దరిని వారించేందుకు ప్రయత్నించిన భట్టితోనూ ఉపేందర్ రెడ్డి వాదనకు దిగడంతో వాగ్వాదం తీవ్రమైంది.

Full View

Tags:    

Similar News