TPCC: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై హైకమాండ్ కు ఫిర్యాదు

ధర్మపురి సంజయ్, ఎర్రశేఖర్ చేరికపై నేతల అసంతృప్తి క్రిమినల్ రికార్డు ఉన్నవారిని పార్టీలో ఆహ్వానిస్తున్నారంటూ ఆరోపణ

Update: 2021-07-15 15:30 GMT

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

TPCC: తెలంగాణ కాంగ్రెస్ లో ఫిర్యాదుల పర్వం కొనసాగుతుంది. క్రిమినల్ ట్రాక్ రికార్డు ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పార్టీ హైకమాండ్ కు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఫిర్యాదు చేశారు. నిర్భయచట్టం కింద జైలు శిక్ష అనుభవించిన ధర్మపురి సంజయ్ ను పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించారు. ధర్మపురి సంజయ్ చేరికపై సొంత జిల్లా నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్రిమినల్స్ గా ముద్ర ఉన్న ఎర్రశేఖర్, ధర్మపురి సంజయ్ లను పార్టీలో చేరికను అడ్డుకొని పార్టీ గౌరవాన్ని కాపాడాలని లేఖలో కోరారు.

Tags:    

Similar News