దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన కల్నల్ సంతోష్బాబు పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు జనం భారీగా తరలివస్తున్నారు. సూర్యాపేటలోని ఆయన నివాసం పరిసర ప్రాంతాలు జనసందోహంగా మారాయి. గురువారం తెల్లవారుజాము నుంచే కల్నల్ సంతోష్బాబు పార్థివదేహానికి జనం నివాళులు అర్పిస్తున్నారు. సంతోష్బాబు భౌతికకాయానికి పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు.
తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ డి.అర్వింద్, తదితరులు సంతోష్బాబు పార్థివహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కాసేపట్లో కేసారంలోని వ్యవసాయక్షేత్రంలో సైనిక లాంఛనాలతో సంతోష్బాబు అంత్యక్రియలు జరగనున్నాయి. సూర్యాపేట నుంచి కేసారం వరకు అంతిమయాత్ర కొనసాగనుంది.