సైనిక లాంఛనాలతో కల్నల్‌ సంతోష్‌బాబు‌ అంత్యక్రియలు పూర్తి

Update: 2020-06-18 06:39 GMT

భారత్‌ -చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబు అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో నిర్వహించారు. కల్నల్‌ సంతోష్‌బాబు అంతిమయాత్రలో భారీగా ప్రజలు పాల్గొన్నారు.

సూర్యాపేట సమీపంలోని స్వగ్రామం కేసారంలో సైనిక లాంఛనాలతో కల్నల్‌ సంతోష్‌బాబు అంత్యక్రియలు నిర్వహించారు. వీరజవాన్‌కు నివాళిగా జవాన్లు గాల్లోకి మూడుసార్లు తూటాలు పేల్చి.. గౌరవ వందనం సమర్పించారు. ఆపై సంతోష్‌బాబు సతీమణి, కుమారుడు, బంధువులు, ప్రజలు సెల్యూట్‌ చేశారు. కుమారుడు సంతోష్‌బాబు చితికి తండ్రి ఉపేందర్‌ నిప్పుపెట్టడంతో అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. 

Tags:    

Similar News