CM Revanth Reddy: రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ సుడిగాలి పర్యటనలు

CM Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ సీట్లే లక్ష్యంగా ప్రచారం

Update: 2024-04-26 06:30 GMT

CM Revanth Reddy: రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ సుడిగాలి పర్యటనలు

CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి సుడిగాలి పర్యటనలతో రాష్ట్రమంతా చుట్టేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లే లక్ష్యంగా ప్రచారాన్ని ఉధృతం చేశారు. వరుస సభలు, సమావేశాలకు హాజరవుతూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ.. కార్యకర్తలను ఉత్తేజపరుస్తున్నారు. ఇవాళ జహీరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. సాయంత్రం 5 గంటలకు జహీరాబాద్‌లో రేవంత్‌ రోడ్ షో నిర్వహించనున్నారు. సీఎం రాక సందర్భంగా.. పటిష్ట బందోబస్తు నిర్వహించారు. పదేళ్లలో రాష్ట్రానికి కేంద్రంలో ఉన్న బీజేపీ... బీఆర్ఎస్‌ ఏం చేయలేదని మండిపడ్డారు సీఎం రేవంత్.

Tags:    

Similar News