Revanth Reddy: అందెశ్రీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం

Revanth Reddy: ప్రజాగాయకుడు, రచయిత అందెశ్రీ మరణం వ్యక్తిగతంగా తనకు, అలాగే యావత్ తెలంగాణ సమాజానికి తీరని లోటు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

Update: 2025-11-11 08:45 GMT

Revanth Reddy: అందెశ్రీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం

Revanth Reddy: ప్రజాగాయకుడు, రచయిత అందెశ్రీ మరణం వ్యక్తిగతంగా తనకు, అలాగే యావత్ తెలంగాణ సమాజానికి తీరని లోటు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అందెశ్రీ అంత్యక్రియలు పూర్తయిన అనంతరం ఘట్‌కేసర్‌లో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

సీఎం రేవంత్‌రెడ్డి చేసిన కీలక ప్రకటనలు:

గతంలో తెలంగాణ అంశాలపై తాను అందెశ్రీతో అనేక విషయాలు చర్చించినట్లు ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.  "అందెశ్రీ ప్రతి మాట ప్రజా జీవితంలో నుంచి పుట్టుకొచ్చింది. ఆయన ప్రతి పాట తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపింది," అని రేవంత్‌రెడ్డి కొనియాడారు.

తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతమైన అందెశ్రీ రచించిన 'జయ జయహే తెలంగాణ' గీతాన్ని పాఠ్య పుస్తకాల్లో చేరుస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అందెశ్రీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అందెశ్రీ సేవలను తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని సీఎం తెలిపారు.

Tags:    

Similar News