రేపు మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

* ఈడీ, సీబీఐ దాడుల నేపథ్యంలో కేసీఆర్ స్పీచ్‌పై ఉత్కంఠ

Update: 2022-12-03 11:11 GMT

రేపు మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

CM KCR Tour: రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఓవైపు ఈడీ, సీబీఐ దాడులు, మరోవైపు అధికార, ప్రతిపక్ష నేతల విమర్శలతో రాష్ట్రం అట్టుడుకుతుంది. ఈ నేపద్యంలో రేపు మహబూబ్‍నగర్‍ జిల్లాలో సీఎం కేసీఆర్‍ పర్యటనలో భాగంగా పాల్గొనే భహిరంగ సభపై అందరి దృష్టి పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్‍ పాల్గొనే సభను విజయవంతం చేసేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని TRS నేతలు తీవ్రంగా కృషిచేస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్‍ సైతం సభలో రాష్ట్ర రాజకీయాలపై హాట్‍ కామెంట్స్ చేసే అవకాశాలు ఉండటంతో బహిరంగసభకు ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags:    

Similar News