CM KCR: తెలంగాణలో అకాల వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
CM KCR: పంట నష్టం అంచనా వేయాలని సీఎస్కు కేసీఆర్ ఆదేశం
CM KCR: తెలంగాణలో అకాల వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
CM KCR: తెలంగాణలో అకాల వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరీంనగర్, చొప్పదండి సహా మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలవల్ల పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఏయే ప్రాంతాల్లో ఎంత మేరకు పంటలు దెబ్బతిన్నాయో అంచనా వేసేందుకు చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతి కుమారికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు. జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి ఆయా జిల్లాల్లో దెబ్బతిన్న పంటలకు సంబంధించిన నివేదికలు తెప్పించాలని సూచించారు.