లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్‌

Update: 2019-08-06 12:13 GMT

సీఎం కేసీఆర్‌ ధర్మపురిలో పర్యటించారు. ఇందులో భాగంగా ధర్మపురి లక్ష్మినరసింహాస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి వచ్చిన సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్‌ వెంట మంత్రులు ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు సంజయ్‌ కుమార్‌, విద్యాసాగర్‌ రావు, సుంకె రవికుమార్‌, ఎంపీలు సంతోష్‌ కుమార్‌, బోర్లకుంట వెంకటేశ్‌, పలువురు నేతలు ఉన్నారు.



Tags:    

Similar News