పంచాయతీరాజ్‌ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్‌ సమావేశం

Update: 2019-09-03 09:47 GMT

పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశం అయ్యారు. తెలంగాణ అకాడమి ఆఫ్ రూరల్‌ డెవలప్ మెంట్ లో నిర్వహించిన ఈ సమావేశంలో.. ఈ నెల 6 నుంచి అన్ని గ్రామాల్లో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. అయితే ఈ 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలును పర్యవేక్షించేందుకు గ్రామానికి ఒకరు చొప్పున మండలస్థాయి అధికారులను ఇంచార్జులుగా నియమించాలని నిర్ణయించారు. విస్తృత ప్రజాభాగస్వామ్యంతోనే గ్రామాల రూపురేఖలు మార్చడమే తమ లక్ష్యం అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ లక్ష్యం నెరవేర్చేందుకే 30 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నామని తెలిపారు. 

Tags:    

Similar News