రూ.2 కోట్లు ఎగనామం.. చిట్టీల వ్యాపారి భార్యను చెట్టుకు కట్టేసిన బాధితులు..
Chit Fund Victims: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని సంజయ్నగర్ జేకే కాలనీలో దారుణం జరిగింది.
Chit Fund Victims: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని సంజయ్నగర్ జేకే కాలనీలో దారుణం జరిగింది. ఢిల్లీ శంకరయ్య అనే చిట్టీల ఓనర్ భార్య, కూతురుని ఆ ప్రాంత బాధితులు చెట్టుకు కట్టేశారు. సింగరేణి కార్మికుడు అయిన ఢిల్లీ శంకరయ్య సంజయ్నగర్లో కొంత కాలంగా చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు. శంకరయ్యను నమ్మిన ప్రజలు.. లక్షల్లో చిట్టీలు వేశారు. ఇటీవల శంకరయ్య చిట్టిలు వేసిన 70 మందికి సుమారు 2 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి కుటుంబంతో సహా పరారయ్యాడు. ఇవాళ ఢిల్లీ శంకరయ్య భార్య, ఆయన కూతురు దసరా పండగకు వారి ఇంటికి రాగా.. చిట్టీల బాధితులు వారిని దుర్భాషలాడుతూ చెట్టుకు కట్టేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగానే వారిని వదిలిపెట్టారు.