దిశ కేసులో చార్జ్‌షీట్‌కు రంగం సిద్ధం

Update: 2019-12-16 07:04 GMT

దిశ కేసులో చార్జ్‌షీట్‌కు రంగం సిద్ధమైంది. ఈ నెలఖరులోగా చార్జ్‌షీట్‌ వేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే డీఎన్‌ఏ, ఫోరెన్సిక్ రిపోర్ట్స్‌ తెప్పించుకున్న సైబరాబాద్ పోలీసులు 50 మందికి పైగా సాక్షులను విచారణ చేశారు. ఇక ఈ కేసులో నివేదికలు, పోస్ట్‌మార్టం రిపోర్ట్‌తో పాటు సీసీటీవీ ఫూటేజ్‌ కీలక ఆధారం అని పోలీసులు చెబుతున్నారు. ఇక పోలీసులు ఛార్జ్ షీట్ వేసిన తర్వాతే.. కోర్టు విచారణ చేపట్టి అవకాశం ఉంది. కాగా, ఇప్పటికే నిందితుల మృతదేహాలను గాంధీ ఆసుపత్రిలో భద్రపరిచిన సంగతి తెలిసిందే. 

Full View

Tags:    

Similar News