జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసులో ఛార్జిషీట్ దాఖలు; విజయ్ మద్దూరి డ్రగ్స్ పాజిటివ్

మళ్లీ తెరపైకి జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసు ఈ కేసులో ఛార్జిషీట్ ధాఖలు చేసిన మోకిల పోలీసులు గతేడాది అక్టోబర్ 26న రాజ్‌ పాకాల ఫామ్‌హౌస్‌లో పార్టీ పార్టీకి అనుమతి లేకపోవడంతో పాటు అక్రమంగా.. మద్యం వినియోగించారని తనిఖీలు నిర్వహించిన పోలీసులు

Update: 2025-12-24 06:28 GMT

జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసులో ఛార్జిషీట్ దాఖలు; విజయ్ మద్దూరి డ్రగ్స్ పాజిటివ్

జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో తాజాగా ఛార్జిషీట్ దాఖలైంది. గతేడాది అక్టోబర్ 26న కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్‌హౌజ్‌లో పార్టీ నిర్వహించారు. పార్టీకి అనుమతి లేకపోవడంతో పాటు అక్రమంగా మద్యం వినియోగించారని పోలీసులు రైడ్ చేశారు. ఆ పార్టీలో పాల్గొన్నవారికి అప్పట్లో డ్రగ్ పరీక్షలు నిర్వహించారు పోలీసులు. అందులో విజయ్ మద్దూరికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. దీంతో అతడిపై NDPS యాక్ట్ కింద నమోదు చేశారు మోకిల పోలీసులు. తాజాగా ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేశారు మోకిల పోలీసులు. ఈ కేసులో మొత్తం 35 మంది స్టేట్మెంట్లను పోలీసులు రికార్డ్ చేశారు.

Tags:    

Similar News