మున్సిపల్ ఎన్నికల్లో రెండుచోట్ల ఓటు వేశాడని వైస్ ఎంపీపీపై కేసు నమోదైంది. వైస్ ఎంపీపీ నరేష్ కామారెడ్డి మండలం నర్సన్నపల్లి, దేవునిపల్లిలో రెండుచోట్లా ఓటు హక్కు కలిగి ఉన్నాడని కలెక్టర్కు ఫిర్యాదు అందింది. నర్సన్నపల్లి, దేవునిపల్లిలో డబుల్ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారుల విచారణలో తేలింది. దీంతో వైఎస్ ఎంపీపీపై పోలీసులు కేసు నమోదు చేశారు.