పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో రోడ్డు ప్రమాదం సంభవించింది. కాట్నపల్లి వద్ద కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ కు చెందిన ఇంజనీర్ మంథని రామకృష్ణ కుటుంబంతో కలిసి మంచిర్యాల నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.