Lok Sabha Elections: నల్గొండ, భువనగిరి స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్‌ఎస్‌

Lok Sabha Elections: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో ఇద్దరు లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించారు.

Update: 2024-03-23 12:32 GMT

Lok Sabha Elections: నల్గొండ, భువనగిరి స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్‌ఎస్‌

Lok Sabha Elections: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో ఇద్దరు లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించారు. నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా క్యామ మల్లేష్ పేర్లను అనౌన్స్ చేశారు గులాబీ బాస్. ఇప్పటికే నిర్వహించిన సమీక్షలో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావుగౌడ్‌ను ప్రకటించిన ఆయన హైదరాబాద్ స్థానం మినహా 16 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

నాగర్‌కర్నూల్‌ నుంచి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, మెదక్‌ నుంచి వెంకట్రామిరెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి మ‌న్నె శ్రీనివాస్ రెడ్డి, క‌రీంన‌గ‌ర్ నుంచి వినోద్ కుమార్, పెద్దప‌ల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, జ‌హీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, ఖ‌మ్మం నుంచి నామా నాగేశ్వర్ రావు, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మ‌హ‌బూబాబాద్ నుంచి మాలోత్ క‌విత‌, మ‌ల్కాజ్‌గిరి నుంచి రాగిడి ల‌క్ష్మారెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం స‌క్కు, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవ‌ర్ధన్, వ‌రంగ‌ల్ నుంచి క‌డియం కావ్య బరిలో ఉన్నారు.

Tags:    

Similar News