పెళ్లింట విషాదం..మూహూర్తానికి గంట ముందే వరుడు మృతి

Bride Groom Death : మరొక గంటలో పెళ్ళికి శుభముహూర్తం. పందిట్లో బంధువుల సందడి, బాజా భజంత్రీల చప్పుల్లు మొదలయ్యాయి.

Update: 2020-08-09 08:35 GMT
ప్రతీకాత్మక చిత్రం

Bride Groom Death : మరొక గంటలో పెళ్ళికి శుభముహూర్తం. పందిట్లో బంధువుల సందడి, బాజా భజంత్రీల చప్పుల్లు మొదలయ్యాయి. వధువు వెయ్యి ఆశలతో తన జీవిత భాగస్వామితో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఎన్నో కలలు కంటుంది. సరిగ్గా అదే సమయానికి పిడుగుపాటు లాంటి వార్త. మరికొద్ది సేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు విగతజీవిగా మారాడు. బాజా భజంత్రీలు మోగుతున్న పందిరిలో ఒక్కసారిగా చావుడప్పులు, ఆర్తనాదాలు వినిపించాయి. వధువు కలలు కల్లలయ్యాయి. వరుడు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లోనూ విషాదం అలుముకుంది.

ఈ విషాదసంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్ గ్రామానికి చెందిన బైరబోయిన మల్లయ్య, మల్లమ్మ దంపతులకు నరేష్ (25) అనే కుమారుడు ఉన్నాడు. కాగా అతనికి నెల్లికుదురు మండలం బ్రాహ్మణకొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో వివాహం నిశ్చయం అయింది. 8వ తేదీ శనివారం రాత్రి 11 గంటల 27 నిమిషాలకు ముహూర్తం నిర్ణయించారు. చూస్తుండగానే ముహూర్తం వచ్చేసింది. పెళ్లి పనులు మొదలయ్యాయి. బంధువుల సందడి మొదలయింది. సరిగ్గా అదే సమయానికి వరుడు నరేష్ తనకు కాస్త అనారోగ్యంగా ఉందని చెప్పడంతో అతని తల్లిదండ్రులు స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించి ఇంటికి తీసుకువచ్చారు. మూహూర్తానికి ఇంకా సమయం ఉండడంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ ఆ నిద్రలోనే చనిపోయాడు. మూహర్తం సమయం వచ్చినా వరుడు నిద్రనుంచి లేవకపోవడంతో అతని తల్లిదండ్రులు మళ్లీ వైద్యుడ్ని పిలిచి పరీక్షలు చేయించాడు. కానీ అప్పటికే వరుడు చనిపోయినట్టు ధ్రువీకరించారు. దీంతో ఆ రెండు కుటుంబాల్లో విషాధఛాయలు అలుముకున్నాయి.


Tags:    

Similar News