Prashanth Reddy: నిజామాబాద్‌లో మంత్రి ప్రశాంత్‌రెడ్డికి చేదు అనుభవం

Prashanth Reddy: తిప్పారం రోడ్డు వద్ద మంత్రిని అడ్డుకున్న బీజేవైఎం నాయకులు

Update: 2021-07-06 02:25 GMT

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (ఫహుతో ది హన్స్ ఇండియా)

Prashanth Reddy: నిజామాబాద్‌ జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గాంధారి మండల కేంద్రంలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమానికి మంత్రి హాజరై తిరుగు ప్రయాణమయ్యారు. తిప్పారం రోడ్డు వద్దకు రాగానే మంత్రి కాన్వాయ్‌ని బీజేవైఎం నాయకులు అడ్డుకున్నారు. దీంతో స్థానికంగా కాస్తా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలంటూ, సీఎం కేసీఆర్‌, మంత్రి డౌన్‌డౌన్‌ అంటూ ప్లేకార్డులు ప్రదర్శించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బీజేవైఎం నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Tags:    

Similar News