మోడీ వ్యక్తి కాదు శక్తి : ఎమ్మెల్యే రాజాసింగ్

అన్నదాతల సంక్షేమం కోసం కేంద్రం చట్టం తీసుకువస్తే.. ప్రతిపక్షాలు మాయమాటలతో రైతులను పక్కదారి పట్టిస్తున్నాయన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్.

Update: 2020-12-08 08:14 GMT

అన్నదాతల సంక్షేమం కోసం కేంద్రం చట్టం తీసుకువస్తే.. ప్రతిపక్షాలు మాయమాటలతో రైతులను పక్కదారి పట్టిస్తున్నాయన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. రైతులను మోసం చేసిన కేసీఆర్.. భారత్‌ బంద్‌కు మద్ధతు తెలపడం హాస్యాస్పదమన్నారు. దళారుల చేతుల్లో రైతాంగం మోసపోవద్దనే కేంద్రం చట్టం తెచ్చిందని వివరించారు. కొత్త చట్టాలపై రైతులు పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతిపక్షాలు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని, మోడీ వ్యక్తి కాదు శక్తి అంటూ వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే రాజాసింగ్.

Tags:    

Similar News