Raja Singh: టీఆర్ఎస్ పాలనలో ప్రజలు విసుగెత్తిపోయారు

*నిజామాబాద్ జిల్లా రెంజల్ పట్టణంలో... రోడ్ల గుంతలపై వరినాట్లు వేసి నిరసన తెలిపిన ఎమ్మెల్యే రాజాసింగ్

Update: 2022-07-24 10:31 GMT

Raja Singh: టీఆర్ఎస్ పాలనలో ప్రజలు విసుగెత్తిపోయారు

Raja Singh: ఎనిమిదేళ్లుగా టీఆర్ఎస్ పాలనలో విసుగెత్తిన ప్రజలు బీజేపీ వైవే మోగ్గు చూపుతున్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు. ప్రజాగోస, బీజేపీ భరోసా యాత్రలో భాగంలో ఆయన నిజామాబాద్ జిల్లా రేంజల్ పట్టణంలో ద్విచక్రవాహన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం గుంతల రోడ్లపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే షకీల్ అవినీతి అక్రమాలను ప్రొత్సహిస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు.

Tags:    

Similar News