వ్యక్తిగత పనుల మీద ఢిల్లీ వెళ్లే కేసీఆర్.. రైతు సమస్యలపై ఎందుకు వెళ్లరు?

Rajasingh: గతంలో రైతు చట్టాలు బాగున్నాయని కేసీఆర్‌ అన్నారు - రాజాసింగ్‌

Update: 2021-11-18 11:29 GMT

సీఎం కెసిఆర్ పై కౌంటర్ వేసిన ఎమ్మెల్యే రాజా సింగ్ (ఫైల్ ఇమేజ్)

Rajasingh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం కేసీఆర్‌పై కౌంటర్ వేసారు. రైతు చట్టాలు బాగున్నాయని గతంలో చెప్పిన కేసీఆర్‌ దర్నా చౌక్ వద్ద యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. హుజురాబాద్ ఓటమితో గ్రాఫ్ పడిపోవటంతో కేసీఆర్ కవర్ చేసుకునే పనిలో ఉన్నారని అన్నారు రాజాసింగ్‌. వ్యక్తిగత పనుల మీద ఢిల్లీ వెళ్ళే కేసీఆర్ రైతు సమస్యల మీద ఎందుకు వెళ్ళరని ప్రశ్నించారు. భయంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ దర్నాలు చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు రాజాసింగ్‌.

Tags:    

Similar News