TS BJP: తెలంగాణకు క్యూ కడుతున్న బీజేపీ జాతీయ నేతలు

TS BJP: సభలు, రోడ్ షోలలో పాల్గొంటున్న అమిత్ షా, నడ్డా

Update: 2023-11-25 07:45 GMT

TS BJP: తెలంగాణకు క్యూ కడుతున్న బీజేపీ జాతీయ నేతలు

TS BJP: బీజేపీ జాతీయ నాయకులంతా తెలంగాణకు క్యూకడుతున్నారు. మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ప్రచార గుడువు ముగుస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలంతా ప్రచారం ముమ్మరం చేయడానికి రంగం సిద్ధం చేశారు. స్వయంగా ప్రధాని మోడీ వరుసగా మూడు రోజుల పాటు ప్రచారం చేయనున్నారు. బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాలను టార్గెట్ చేస్తూ ప్రచారం నిర్వహించనున్నారు. మోడీతో పాటు అమిత్ షా, జేపీ నడ్డా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇవాళ మహేశ్వరం, కామారెడ్డిలో మోడీ ప్రచారం చేస్తారు.

ఎన్నికల ప్రచార గడవు కేవలం నాలుగు రోజుల మాత్రమే ఉంది. దీంతో బీజేపీ నేతలంతా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించి అక్కడ ఓటర్ల దృష్టిని తమ వైపు తిప్పుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ ముఖ్యమంత్రి, వరి క్వింటాల్‌కు 3,100 రూపాయలు వంటి పథకాలు, ప్రజల్లోకి తీసుకు వెళ్లి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. జాతీయ నేతల ప్రచారంతో కార్యకర్తల్లోను, నాయకుల్లోనూ జోష్ పెరిగింది. ప్రధాని మోడీ మూడు రోజుల ప్రచారంతో బీజేపీకి అనుకూల పవనాలు వీచే అవకాశముంటుందని నాయకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News