ఖమ్మం జిల్లా వైరాలో బీజేపీ నేత హత్య

* నేలవెళ్లి రామారావును కత్తితో పొడిచిన దుండగులు * దాడిలో తీవ్రంగా గాయపడిన రామారావు * హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి

Update: 2020-12-26 07:32 GMT

ఖమ్మం జిల్లా వైరాలో బీజేపీ నేత హత్యకు గురయ్యారు. కొందరు దుండగులు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన నేలవెళ్లి రామారావు చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే వ్యక్తిగత కక్షల నేపథ‌్యంలోనే రామారావును హత్య చేసినట్లు చెబుతున్నారు స్థానికులు.

సమాచార హక్కు చట్టం కార్యకర్తగా పనిచేస్తోన్న రామారావును తన నివాసం దగ్గరకు వచ్చిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు.. కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. గాయపడిన రామారావును ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే తీవ్రమైన గాయాలు కావటంతో చికిత్స పొందుతూనే మరణించారు రామారావు. 

Tags:    

Similar News