ఒవైసీ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: బీజేపీ

Update: 2019-12-23 10:44 GMT
కృష్ణసాగర్ రావు

పౌరసత్వ సవరణ చట్టంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు ఖండించారు. సోమవారం ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతూ దారుస్సలాంలో జాతీయగీతంతో కార్యక్రమం ప్రారంభించడం మొదటిసారి జరిగిందని పేర్కొన్నారు. బారిస్టర్‌ చదివిన ఎంపీ అసద్‌ ప్రజలను తప్పుదోవ పట్టించేలా లోక్‌సభలో బిల్లును చింపడంపై మండిపడ్డారు. ఒవైసీ రాజ్యాంగాన్నే కాదు దేశాన్ని అవమానించారన్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై బహిరంగ చర్చకు సిద్దమా అని ప్రశ్నించారాయన. చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని నిరూపించలేకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. 

Tags:    

Similar News