హుజూరాబాదా..? హుస్నాబాదా?.. పాదయాత్ర ముగింపు సభపై బీజేపీ కన్ఫ్యూజన్‌

Bandi Sanjay: పాదయాత్ర ముగింపు సభపై బీజేపీ కన్ఫ్యూజన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది

Update: 2021-09-29 06:45 GMT

 పాదయాత్ర ముగింపు సభపై బీజేపీ కన్ఫ్యూషన్ (ఫైల్ ఇమేజ్)

Bandi Sanjay: హుజూరాబాదా..? హుస్నాబాదా..? పాదయాత్ర ముగింపు సభపై బీజేపీ కన్ఫ్యూజన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్‌తో బండి సంజయ్ పాదయాత్రకు ఇబ్బందులు ఎదురయ్యాయి. హుజూరాబాద్‌లో అక్టోబర్ 2న ముగింపు ర్యాలీ తలపెట్టింది బీజేపీ. అయితే ఉప ఎన్నికకు ఎలక్షన్ కమిషన్ కఠిన నిబంధనలు విధించింది. ఎన్నికల కమిషన్ నిబంధనలతో బీజేపీ ర్యాలీకి ఆటంకాలు ఎదురయ్యాయి. 500 మందికి మించి జనాలు ఉండకూడదని ఈసీ నిబంధన పెట్టింది.

బండి సంజయ్ పాదయాత్ర రేపు కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించనుంది. హుజూరాబాద్ కాకుండా హుస్నాబాద్‌కు వెళ్తే ఎలా ఉంటుందన్న దానిపై సమాలోచనలు చేస్తున్నారు కమలం నేతలు. హుజూరాబాద్ నియోజకవర్గానికి సమీపంలో భారీ సభకు ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. అయితే కాసేపట్లో బండి సంజయ్ పాదయాత్ర కమిటీ సమావేశంకానుంది. ముగింపు సభపై క్లారిటీ రానుంది.

Tags:    

Similar News