తస్మాత్ జాగ్రత్త
పట్టణాల్లోని ప్రజలు రాత్రి వేళల్లో మాత్రమే కాదు. ఇప్పుడు పగలు కూడా దొంగలకు భయపడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. పట్టపగలే దొంగలు ఇండ్లలో చొరబడి దొంగాతనాలకు పాల్పపడుతున్నారు.
పట్టణాల్లోని ప్రజలు రాత్రి వేళల్లో మాత్రమే కాదు. ఇప్పుడు పగలు కూడా దొంగలకు భయపడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. పట్టపగలే దొంగలు ఇండ్లలో చొరబడి దొంగాతనాలకు పాల్పపడుతున్నారు.
ఇలాంటి ఒక సంఘటన హైదరాబాద్ నగర శివార్లలోని గండిపేట సమీపంలోని కిస్మత్పూర్లో చోటు చేసుకుంది. పట్టపగలే గొలుసు దొంగలు రెచ్చిపోయి మూడు ఇళ్లలోకి చొరబడ్డారు. మహిళల మెడలో ఉన్న బంగారు గొలుసులు లాకెళ్ళిపోయే ప్రయత్నం చేసారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆ దొంగలను వెంటాడి పట్టుకుని వారిని పోలీసులకు అప్పగించారు.