నేడు నిజామాబాద్ జిల్లాలో బండి సంజయ్‌ పర్యటన

Bandi Sanjay: తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. దొరికిన ఏ ఒక్క అంశాన్ని వదలుకోవడం లేదు.

Update: 2022-01-27 03:25 GMT

నేడు నిజామాబాద్ జిల్లాలో బండి సంజయ్‌ పర్యటన

Bandi Sanjay: తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. దొరికిన ఏ ఒక్క అంశాన్ని వదలుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే ఎంపీ అర్వింద్‌పై దాడికి నిరసనగా చలో నిజామాబాద్ కు పిలుపు నిచ్చారు టీ.బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఇందులో భాగంగా ఆర్మూర్ లో బీజేపీ కార్యకర్తలను పరామర్శించనున్నారు బండి సంజయ్. అటు బీజేపీ పర్యటన నేపథ్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. నిజామాబాద్ వెళ్లకుండా హౌస్ అరెస్ట్ లు చేస్తామని చెబుతున్నారు పోలీసులు. మరోవైపు తాము వెనక్కి తగ్గబోయేది లేదంటున్నారు బీజేపీ ముఖ్యనేతలు. అంతేకాదు.. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి బయల్దేరుందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News