Bandi Sanjay: కేసీఆర్ కు ఉగ్రవాద సంస్థలేమైనా ఆర్థికసాయం చేస్తున్నాయా? ఇన్ని వేల కోట్లు..

Bandi Sanjay: కేసీఆర్ కు ఉగ్రవాద సంస్థలేమైనా ఆర్థికసాయం చేస్తున్నాయా?

Update: 2023-04-04 14:00 GMT

Bandi Sanjay: కేసీఆర్ కు ఉగ్రవాద సంస్థలేమైనా ఆర్థికసాయం చేస్తున్నాయా? ఇన్ని వేల కోట్లు..

Bandi Sanjay: సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. 8 ఏళ్ల క్రితం నందినగర్‌లో ఇల్లు మాత్రమే ఉన్న కేసీఆర్‌కు ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. టెర్రరిస్టు, ఇతర సంస్థలేమైనా సాయం చేస్తున్నాయా అనే డౌట్ ఎక్స్‌ప్రెస్ చేస్తూనే...కేసీఆర్ ఆస్తులపై.. తక్షణమే సంబంధిత ఏజెన్సీ సంస్థలన్నీ సమగ్ర విచారణ జరపాలని కోరారు సంజయ్. ప్రజల నుంచి దోపిడీ చేసిన సొమ్ముతో జాతీయ రాజకీయాలు చేయాలని చూస్తున్నాడని బండి సంజయ్ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రజలే తగిన జవాబు ఇస్తారని స్పష్టం చేశారు. అంతేకాదు, మోదీ విద్యార్హతల సర్టిఫికెట్ నేపథ్యంలోనూ బండి సంజయ్ స్పందించారు. కేసీఆర్ తన విద్యార్హతల సర్టిఫికెట్ ను బయటపెట్టాలని అన్నారు.

Tags:    

Similar News