Bandi Sanjay Pays Tributes to Kargil Warriors: వారి త్యాగాల‌ను ఎప్పటికీ మర్చిపోరు: బండి సంజ‌య్‌

Bandi Sanjay Pays Tributes to Kargil Warriors: భారత దేశ ప్రజలు కార్గిల్ విజయాన్ని ఎప్పటికీ మర్చిపోరని, వారి త్యాగాల‌ను చిరకాలం గుర్తుంచుకుంటారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

Update: 2020-07-26 08:19 GMT
Bandi Sanjay Pays Tributes

Bandi Sanjay Pays Tributes to Kargil Warriors: భారత దేశ ప్రజలు కార్గిల్ విజయాన్ని ఎప్పటికీ మర్చిపోరని, వారి త్యాగాల‌ను చిరకాలం గుర్తుంచుకుంటారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఆదివారం కార్గిల్‌ విజయ్‌దివస్‌ సందర్భంగా సైనికుల త్యాగాలను ఆయన గుర్తు చేసుకున్నారు. కార్గిల్ యుద్ధం సమయంలో నాటి భారత ప్రధాని అటల్ బిహారి వాజపేయి తీసుకున్న నిర్ణయాలను సంజయ్‌ కొనియాడారు.

ఆనాడు భారత సైన్యానికి ఉత్తేజపరుస్తూ.. వారికి కావాల్సిన సహకారాన్ని అందించారన్నారు. దేశాన్ని ఒక్కటిగా నడడటంలో ఆయన గొప్ప విజ్ఞత ప్రదర్శించారని కొనియాడారు. దేశం కోసం త్యాగం.. వీరమరణం పొందిన సైనికులు త్యాగం వృధా పోదన్నారు. కార్గిల్‌ యుద్ధంలో తెలంగాణకు చెందిన వీరసైనికులు కూడా ఉన్నారని చెప్పారు. దేశభక్తిని పెంపొందించడం, దేశం కోసం పోరాడటం, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేలా విజయ్‌ దివస్‌ ఒక గుర్తింపు తెచ్చుకుందని సంజయ్‌ తెలిపారు.కార్గిల్ అమరవీరుల స్ఫూర్తితో చైనా కుతంత్రాలను కూడా భారత సైన్యం తిప్పి కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. దీనికోసం ప్రధాని మోదీకి దేశ ప్రజలంతా బాసటగా నిలవాలని కోరారు. 


Tags:    

Similar News