Bandi Sanjay: శాంతి భద్రతలను కాపాడాల్సిన వారే రెచ్చగొడుతున్నారు

Bandi Sanjay: తెలంగాణలో పరిస్థితులను మేథావులు గుర్తించాలి

Update: 2022-08-25 07:16 GMT

Bandi Sanjay: శాంతి భద్రతలను కాపాడాల్సిన వారే రెచ్చగొడుతున్నారు

Bandi Sanjay: శాంతి భద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వాధినేత , సీఎం కేసీఆర్ ఉద్రిక్త పరిస్థితులకు కారణం కావడం సిగ్గుచేటని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లో అమ్మవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అధికార పార్టీ ప్రతినిధుల వ్యవహార శైలిని మేధావులు గుర్తించాలన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల తనిఖీల్లో లిక్కర్ మాఫియాలో ప్రమేయంపై బయటకొచ్చిన విషయాన్నిప్రస్తావించారు. తెలంగాణ తీరూతెన్నులు శ్రీలంకలా ఊహించుకుంటున్నారని బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తంచేశారు.

Tags:    

Similar News