Balka Suman: సింగరేణిని ప్రైవేటీకరిస్తే ఉద్యమిస్తాం
Balka Suman: బొగ్గు గనులు ప్రైవేటీకరించొద్దని సీఎం కేంద్రానికి లేఖలు రాశారు
Balka Suman: సింగరేణిని ప్రైవేటీకరిస్తే ఉద్యమిస్తాం
Balka Suman: సింగరేణి ప్రైవేటీకరణపై బీజేపీ నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. బొగ్గు గనులు ప్రైవేటీకరించొద్దని సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖలు రాసినా పట్టించుకోలేదన్నారు. చివరికి రాష్ట్రంలోని బొగ్గుగనులను తమకే అప్పగించాలని సింగరేణి లేఖలు రాసినా స్పందించలేదన్నారు. మూడుసార్లు వేలం ప్రకటన ఇచ్చినా ఎవరూ ముందుకు రాలేదని.. ఇప్పుడు నాలుగోసారి బొగ్గుగనుల వేలానికి ప్రకటన ఇచ్చారన్నారు. లాభాల్లో ఉన్న సింగరేణిని నిర్వీర్యం చేయడమే కేంద్రం లక్ష్యమని బాల్క సుమన్ విమర్శించారు.