దిశ నిందితుల డెడ్ మృతదేహాలకు రీపోస్ట్మార్టం మొదలైంది. రీపోస్ట్మార్టం చేయడానికి ఢిల్లీ ఎయిమ్స్ నుండి ఫోరెన్సిక్ నిపుణులు గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందంతో పాటు రీపోస్ట్మార్టంలో గాంధీ సూపరింటెండెంట్ పాల్గొననున్నారు. ఈ రీపోస్ట్మార్టం మొత్తాన్ని వీడియోగ్రఫీ చేయనున్నారు. రీపోస్ట్మార్టం పూర్తయిన తర్వాత షీల్డ్కవర్లో హైకోర్టుకు నివేదిక ఇవ్వనున్నారు. అయితే ఇప్పటికే నిందితుల కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. రీపోస్ట్మార్టం అనంతరం మృతదేహాలను గాంధీ వైద్యుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.