Nizamabad: ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. రోగి కాళ్లు పట్టి లాక్కెళ్లారు..
Nizamabad: రోగి కాళ్లు పట్టుకుని లాక్కెళ్తున్నా పట్టించుకోని సిబ్బంది
Nizamabad: ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. రోగి కాళ్లు పట్టి లాక్కెళ్లారు..
Nizamabad: నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. స్ట్రెచర్ లేకపోవడంతో రోగి కాళ్లను పట్టు్కుని లిఫ్ట్ వరకు లాక్కెళ్లారు సహాయకులు. ఈ ఘటనను కళ్లారా చూస్తున్నా.. ఆస్పత్రి సిబ్బంది స్పందించలేదు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఆస్పత్రి అధికారులు, సిబ్బందిపై ప్రజలు మండిపడుతున్నారు.