ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రగతిభవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గత కొన్ని రోజులుగా ప్రగతిభవన్ దగ్గర భద్రతపై విమర్శలు రావడంతో ఆసిఫ్ నగర్ ఏసీపీ నంద్యాల నర్సింహారెడ్డిని బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల నరసింహారెడ్డి ప్రగతిభవన్ ముందు ఇంచార్జ్గా ఉన్నారు. విధుల్లో అలసత్వం వహించినందుకే ఏసీపీని బదిలీ చేసినట్లు సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. ఆసిఫ్నగర్ సబ్డివిజన్ బాధ్యతలు డీసీపీ సుమతి పర్యవేక్షించనున్నారు.