చివరి రోజు ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్ఎస్‌ శ్రేణులు

* AS రావు నగర్ డివిజన్లో జోరుగా పావని మణిపాల్‌ రెడ్డి ప్రచారం * కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి-పావని మణిపాల్ రెడ్డి * గ్రేటర్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి.. * బల్దియా కార్యాలయంపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగరవేస్తాం-పావని

Update: 2020-11-29 07:07 GMT

గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో టీఆర్ఎస్‌ అభ్యర్ధులు జోరు పెంచారు. AS రావు నగర్ డివిజన్లో టీఆర్ఎస్‌ అభ్యర్ధి పావని మణిపాల్‌ రెడ్డి భగత్‌ నగర్‌లో పలు కాలనీల్లో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేపట్టారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. జమ్మిగడ్డలో సీసీ రోడ్లు వేశామని. ఏఎస్‌ రావు నగర్ డివిజన్‌ను అభివృద్ధి పథంలో నిలిపింది టీఆర్ఎస్సే నని తెలపారు. ఈ సారి జరగనున్న ఎన్నికల్లో ఘనవిజయం సాధించి బల్దియా కార్యాలయంపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగరవేస్తామని పావని రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Full View


Tags:    

Similar News