BRS: మరో నలుగురు బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థుల ప్రకటన

BRS: తాజాగా నలుగురు అభ్యర్థుల ప్రకటనతో బీఆర్ఎస్

Update: 2024-03-13 16:38 GMT

BRS: మరో నలుగురు బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థుల ప్రకటన

BRS: లోక్‌సభ ఎన్నికల్లో మరో నలుగు స్థానాలకు భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను ప్రకటించింది. చేవెళ్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వరంగల్‌ - డాక్టర్ కడియం కావ్య, జహీరాబాద్‌ - అనిల్‌కుమార్‌, నిజామాబాద్‌ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్‌ను భారాస అధినేత కేసీఆర్ ప్రకటించారు. వరంగల్ లోక్‌సభ పరిధిలోని నేతలతో సమావేశమైన అనంతరం అభ్యర్థిత్వాలను ప్రకటించారు. వరంగల్‌, చేవెళ్లలో భారాసకు సిట్టింగ్ ఎంపీలు ఉన్నప్పటికీ.. ఇతరులకు అవకాశం కల్పించారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మళ్లీ పోటీకి ఆసక్తి చూపకపోవడంతో అక్కడ కాసాని జ్ఞానేశ్వర్‌కు అవకాశం ఇచ్చారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ రెండు దఫాలుగా ప్రాతినిధ్యం వహించారు. మరోమారు పోటీకి సిద్ధమన్న ఆయన... అవకాశం ఇవ్వకపోయినా పార్టీలో కార్యకర్తగా పనిచేస్తానని చెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో సీనియర్ నేత కడియం శ్రీహరి కుమార్తె డాక్టర్ కడియం కావ్య పేరును ఖరారు చేశారు. ఇప్పటికే ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన భారాస.. తాజా ప్రకటనతో మొత్తంతాజాగా నలుగురు అభ్యర్థుల ప్రకటనతో బీఆర్ఎస్ 9 మంది అభ్యర్థిత్వాలు ప్రకటించింది.
Tags:    

Similar News