KTR: రాజన్న సిరిసిల్లలో కేటీఆర్‌కు ఊహించని అనుభవం

KTR: మార్కెట్‌లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేసిన కేటీఆర్

Update: 2024-05-04 04:53 GMT

KTR: రాజన్న సిరిసిల్లలో కేటీఆర్‌కు ఊహించని అనుభవం

KTR: రాజన్న సిరిసిల్ల జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కేటీఆర్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. మార్కెట్‌లో ఎన్నికల ప్రచారం చేస్తూ మహిళలను పలకరించారు కేటీఆర్. అయితే అక్కడ ఉన్న లక్ష్మీ అనే మహిళ కేటీఆర్‌ను ప్రశ్నించింది. సిరిసిల్ల జిల్లా పెద్దూరు శివారు ప్రాంతంలో మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం తీసుకున్న వ్యవసాయ భూములను తిరిగి తమకు అప్పగించాలని కేటీఆర్‌ను కోరింది. కాలేజీ నిర్మాణం కోసం సేకరించిన భూముల్లో తనకున్న రెండెకరాల భూమి పోయిందన్నారు. భూమి ఎప్పుడు తిరిగి ఎప్పుడిస్తారని కేటీఆర్‌ను అడిగింది. కలెక్టర్‌తో మాట్లాడి త్వరలోనే ఇప్పిస్తానంటూ కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఇక మార్కెట్‌లోనూ కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపింది.

Tags:    

Similar News